Ram Nath Kovind: 54 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

President Ram Nath Kovind Unveils 54-foot Samatha Murthy Statue
x

54 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 

Highlights

Ram Nath Kovind: సమతామూర్తి 120 కిలోల బంగారు విగ్రహానికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

Ram Nath Kovind: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లోని సమతామూర్తి కేంద్రంలో జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ శోభాయమానంగా సాగుతోంది. 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆవిష్కరించి లోకార్పణం చేశారు. స్వర్ణమూర్తి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహావిష్కరణకు ముందు సమతామూర్తి కేంద్రంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​..216 అడుగుల రామానుజ విగ్రహాన్ని సందర్శించారు. దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories