Ram Nath Kovind: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

President Ram Nath Kovind Arrives in Hyderabad | TS News Today
x

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Highlights

Ram Nath Kovind: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Hyderabad: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి రాష్ట్రపతి దంపతులు హెలికాఫ్టర్‌లో ముచ్చింత్‌లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు.

భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని కోవింద్ ఆవిష్కరిస్తారు. ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. శ్రీ రామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories