Telangana: 12 ప్రశ్నలతో తెలంగాణలో పీకే టీమ్ సర్వే

Prashant Kishor Survey in Telangana
x

Telangana: 12 ప్రశ్నలతో తెలంగాణలో పీకే టీమ్ సర్వే

Highlights

Telangana: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. తెలంగాణలో గ్రౌండ్ రియాల్టీ కోసం సర్వే లు చేయిస్తున్నారు.

Telangana: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది. తెలంగాణలో గ్రౌండ్ రియాల్టీ కోసం సర్వే లు చేయిస్తున్నారు. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ యాక్టివిటీ పై జనం ఏమనుకుంటున్నారో తేల్చే పనిలో పడ్డారు. కేంద్రం పై కాలు దువ్వుతున్న కేసీఆర్ పై జనం లో వున్న అభిప్రాయం ఏంటి కేసీఆర్ మాటలను ప్రజలు నమ్ముతున్నారా.. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తా అనడం పై జనంలో జరుగుతున్న చర్చ ఏంటి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పై దూకుడు పెంచారు. జాతీయ పార్టీ లేదా ఫ్రంట్ పేరుతో దేశం కోసం బైలెల్లుతా అంటున్నారు. గత వారం నిర్వహించినరెండు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్ చేసి మాట్లాడారు. కొత్త రాజ్యాంగం కావాల్సిందేనని కామెంట్ చేయటం కేంద్రం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ యాక్టివిటీ అంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే జరుగుతుందన్న ప్రచారం ఉంది. ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తున్నారని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ పొలిటికల్ వ్యూహాలపై జనం ఏమనుకుంటున్నారో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఫైట్, అసోం సిఎం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బాసటగా నిలవడాన్ని ప్రజలు ఎలా తీసుకుంటున్నారు..? కేసీఆర్ నయా స్ట్రాటజీ జనాలకు అర్థమయ్యిందా..? అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతోందన్న దానిపై గులాబీ బాస్ సర్వే చేయిస్టున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంపై ఫైట్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు డ్రామా అనుకుంటున్నారా లేదా సీఎం కేసీఆర్ నిజంగానే కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని నమ్ముతున్నారా..? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మీరు ఎటు వైపు ఉంటారు..? ఇలాంటి 12 ప్రశ్నలతో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. టిఆర్ ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? బీజేపీ ని టార్గెట్ చెయ్యడాన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పార్లమెంట్ లో మోడీ రాష్ట్ర విభజన పై మాట్లాడిన మాటలపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? తెలంగాణ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది..? ఇలాంటి అంశాలపై సర్వే చేసి ప్రశాంత్ కిషోర్ టీం సిఎం కేసీఆర్ కు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ కోసం ప్రశాంత్ కిషోర్ సేవలు వాడుకుంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గట్టేక్కేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories