Telangana: తెలంగాణలో పీకే టీం రహస్య సర్వే..!

Prashant Kishor Begins Ground Work for TRS Party
x

Telangana: తెలంగాణలో పీకే టీం రహస్య సర్వే..!

Highlights

Telangana: దేశ రాజకీయాల్లో నిత్యం చర్చలో ఉంటూ, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటరైపోయారు.

Telangana: దేశ రాజకీయాల్లో నిత్యం చర్చలో ఉంటూ, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటరైపోయారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే అధ్యయనం చేసిన పీకే టీమ్ అసలు ప్రణాళికపై దృష్టిసారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే పీకే టీఆర్ఎస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే పనిలో ఉన్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌‌తో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహం, ఎన్నికలలో అనుసరించాల్సిన విధానంపై పీకే నేరుగా పర్యవేక్షించనున్నట్లు గులాబీ పారీ వర్గాలంటున్నాయి.

శనివారం నుంచి తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన మొదలైంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నిన్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి మల్లన్న సాగర్‌లో పర్యటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పీకే అండ్ టీం పరిశీలిస్తున్నారు. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పీకే తన వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు పూర్తి చేసినట్లు పొలిటికల్ వర్గాల టాక్. దీనిపై కూడా పీకే కేసీఆర్‌‌కు సూచనలు చేయనున్నారని గులాబీ పార్టీ వర్గాలంటున్నాయి.

మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అధికార గులాబీ పార్టీకి పీకే నేరుగా పని మొదలు పెడితే ఆయన దగ్గర పనిచేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు కలిసి ప్రశాంత్ కిషోర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్‌ను సందర్శించారు. దానితోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పీకే నేరుగా ఫీల్డ్‌కు వెళ్లి తెలుసుకున్నట్టు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికలు మార్చి 10న ముగిసిన వెంటనే గోవాలో ఉన్న పీకే ఫుల్ టీం తెలంగాణలో దిగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. పీకే టీం నుంచి కీలక వ్యక్తికి తెలంగాణ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషర్‌తో సహా టీంలోని ముఖ్యులతో ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories