కామారెడ్డి జిల్లాలో నాటు బాంబు కలకలం

కామారెడ్డి జిల్లాలో నాటు బాంబు కలకలం
x
Highlights

కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత నాటు బాంబులు పేలడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన...

కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత నాటు బాంబులు పేలడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లూరి సిద్ధిరాములు తన ఇంట్లో నిషేధిత పదార్థాలు నిల్వ ఉంచాడు. ఈ బాంబులు ప్రమాదవశాత్తు పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, సిద్ధిరాములును అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు సిద్ధిరాములు ఈ నాటు బాంబులను వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందని బిక్కనూర్ సీఐ యలాద్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories