తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం దాతృత్వం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం దాతృత్వం
x

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం దాతృత్వం

Highlights

*వికలాంగుడి సమస్యకు పరిష్కారం చూపిన స్పీకర్ *వికలాంగుడికి ట్రై సైకిల్, డబుల్ బెడ్ రూం ఇప్పించిన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. కేవలం ఫోన్ ద్వారా తన బాధను చెప్పుకున్న వికలాంగుడి సమస్యను పరిష్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నరేష్ అంగవైకల్యంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తండ్రిని కోల్పోయిన నరేష్ తల్లితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని కుమ్మరిగూడలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. తల్లి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. నరేష్ దీనగాధ విన్న స్పీకర్ స్పందించి తన కార్యాలయానికి పిలిపించుకుని సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. అంతే కాకుండా నరేష్ కు వికాలంగుల సంక్షేమ శాఖ నుంచి ట్రైసైకిల్ ఇప్పించారు. నరేష్ అతని తల్లి ఉండేందుకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి సూచించారు. వికలాంగుడు సమస్యను స్పీకర్ ఎంతో ఓపిగా విని పరిష్కరించడం చూస్తుంటే మనసున్న మనిషి అని మరోసారి నిరూపించుకున్నారని అర్ధమవుతోంది. ఫోన్ ద్వారా కష్టాలను తెలిపినంతనే స్పందించి తనకు స్వంత ఇంటిని, ట్రై సైకిల్ ను ఉచితంగా అందించిన స్పీకర్ పోచారం గారికి నరేష్ తో పాటుగా వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories