People leaving Hyderabad: కరోనా దెబ్బకు హైదరాబాద్ సగం ఖాళీ.. దర్శనమిస్తున్న టులెట్ బోర్డులు

People leaving Hyderabad: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
People leaving Hyderabad: తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 18వందలు పైగా కేసులు నమోదవుతుంటే ఒక హైదరాబాద్లోనే రోజూ దాదాపు వెయ్యికి కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో నగర ప్రజలు వణికిపోతున్నారు. నగరం విడిచి వెళ్తున్నారు. కొన్నాళ్లు సొంతూళ్లకు వెళ్లి కరోనా తగ్గిన తర్వాత వస్తే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారు. దీంతో చాలా మంది నగరం వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో సహా వెళ్లిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. ఫలితంగా హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఇళ్లలో ఎవరూ దిగట్లేదు. ఉన్న ఇళ్లను ఖాళీ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.
అన్లాక్ 2 తో ఉద్యోగాలు చేసుకోవాలనుకునే వారు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఆఫీసుకి వెళ్లగానే ఎవరిలో కరోనా ఉందో, అది మనకు అంటుకుంటుందేమో అనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది. రాజకీయ నేతలు, పోలీసులు, డాక్టర్లకు కూడా కరోనా సోకుతుండటంతో.. ప్రజలు బాగా ఆందోళన పడుతున్నారు. కరోనా సోకితే వేలకు వేలు ఖర్చవడమే కాకుండా ప్రాణానికే ప్రమాదం అనే ఆలోచనతో ప్రజలు ఉంటున్నారు. ఉద్యోగం సంగతి తర్వాత ముందు ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. దీంతో భవిష్యత్తులో కరోనా పోయిన తర్వాత మళ్లీ ఏదో ఒక జాబ్ దొరుకుతుందిలే అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. కొంతమంది ఇల్లు ఖాళీ చేయకుండానే సామాన్లు ఉంచి వెళ్లిపోయారు. అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు. ఓనర్లు అద్దె అడిగితే బతకడానికే డబ్బుల్లేవు.. ఇక అద్దెలేం చెల్లిస్తాం అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దాంతో ఓనర్లకు కూడా గట్టిగా అడిగే పరిస్థితి లేదు.
ముఖ్యంగా ఐటీ జాబ్స్ చేస్తున్న 15 లక్షల మందిలో ఇప్పుడు నగరంలో లక్ష మంది మాత్రమే ఉన్నారనీ.., మిగతా వాళ్లంతా సొంతూళ్లకు వెళ్లి అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని తెలిసింది. ఇక పిల్లలు కూడా ఆన్లైన్ చదువుల బాట పడుతున్నారు. స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. మాల్స్, బట్టల షాపులు, బజార్లు స్వచ్చందంగా మూసివేసుకుంటున్నారు. కరోనా భయంతో వాటిలో పనిచేస్తున్న వాళ్లు కూడా ఉద్యోగాలు చేయడానికి టెన్షన్ పోవడంలేదు. రియల్ ఎస్టేట్ సైతం పతనమైపోయింది. హైదరాబాద్కి రోజూ ఐదారు లక్షల మంది వస్తుంటారు. కరోనాకి వ్యాక్సిన్ వస్తే తప్ప భాగ్యనగరంలో సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించట్లేదు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT