ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి: పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 12:25 PM IST
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి: పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి
X

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం.. సర్పంచ్ అభ్యర్థులు, యువత, గ్రామస్తులతో భేటీ నిర్వహించి.. పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు.. పోలీస్‌ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు స్పష్టం చేశారు.

పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తొమ్మిది గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని.. ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలు, భయాలకు లోనవకుండా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు డీసీపీ భూక్యా రాంరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story