Revanth Reddy: ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే.. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి..

PCC Chief Revanth Reddy Writes An Open Letter To CM KCR
x

Revanth Reddy: ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే.. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి..

Highlights

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‎కు బహిరంగ లేఖ రాశారు.

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‎కు బహిరంగ లేఖ రాశారు. పోకలగూడెంలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం దారుణమన్నారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోందని, శ్రీనివాసరావు హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేతగానితనంతోనే ఫారెస్ట్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోడు సమస్యలపై మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories