Patnam Mahender Reddy: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

Patnam Mahender Reddy Take Oath As Minister
x

Patnam Mahender Reddy: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

Highlights

Patnam Mahender Reddy: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Patnam Mahender Reddy: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిపై ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories