తెలంగాణ కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు

Party Politics in Telangana Congress
x

తెలంగాణ కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు

Highlights

T Congress: నేతల ఇళ్లల్లో ఠాగూర్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్

T Congress: కాంగ్రెస్ అంటే గ్రూపు గొడవలు, వర్గ పోరు అలకలు కలహాలు కలిసి పోవడాలు కామన్. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త రాజకీయాలు చేస్తోంది. నిత్యం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసి వార్తల్లో ఉండే కాంగ్రెస్ నాయకులు విందు రాజకీయాలు చేస్తున్నారు. పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మనిక్కం ఠాగూర్ చేస్తున్న ఈ వ్యూహం ఫలిస్తుందా..? లంచ్‌లు ,డిన్నర్ పార్టీలతో కాంగ్రెస్ పుంజుకుంటుందా..? నేతలు ఐక్యంగా ఉన్నారని చూపించడం కోసమే వరుస భేటీలా ..? ఈ వరుస సమావేశాల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి.?

టీ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా లంచ్ ,డిన్నర్ రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఇంఛార్జి ఠాగూర్ బ్రేక్ ఫాస్ట్ ఓ నేత ఇంట్లో ,లంచ్ ఇంకో నేత ఇంట్లో, డిన్నర్ మరోనేత ఇంట్లో చేస్తున్నారు. గతంలో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేతలను తన క్వార్టర్స్ కే పిలిపించుకుని మాట్లాడే ఠాగూర్ ఈసారి మాత్రం నేతల ఇళ్ళల్లో లంచ్ ,డిన్నర్ భేటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

పార్టీ ముఖ్య నేతలతో ఠాగూర్ సమావేశం

శనివారం గాంధీ భవన్‌లో మీటింగ్

ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కీలకనేతలతో భేటీ

జానారెడ్డితో ఠాగూర్ రహస్య బ్రేక్ ఫాస్ట్

పిసిసి రాష్ట్ర వ్యవహాల ఇంచార్జీ మనిక్కం ఠాగూర్ శుక్రవారం అర్థరాత్రి వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. శనివారం గాంధీ భవన్ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కీలకనేతలతో ఠాగూర్ సమావేశమైనట్లు తెలుస్తుంది. ఇక ఆదివారం మొత్తం ఠాగూర్ బిజీబిజీగా గడిపారు. ఉదయం జానారెడ్డి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కు ప్లాన్ చేసిన ఠాగూర్ , సడెన్ గా ప్లాన్ మార్చి ఓ రహస్య ప్రదేశంలో జానారెడ్డితో బ్రేక్ ఫాస్ట్ చేసారు. అయితే జానారెడ్డి, ఠాగూర్ భేటీ సమయంలో ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడ కలిసారనే చర్చ పార్టీలో ఆసక్తికరంగా సాగుతుంది.

చివరి నిమిషంలో సునీల్ ప్రోగ్రాం క్యాన్సిల్

రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చ

కోమటిరెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన ఠాగూర్

ఇక మధ్యాహ్నం తన స్నేహితుడు సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో లంచ్ భేటీలో పాల్గొన్నారు మనిక్కం ఠాగూర్. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఠాగూర్, బోస్ రోజు కూడా పాల్గొన్నారు. వ్యూహకర్త సునీల్ కనుగోలు రావాల్సి ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి దగ్గర మీడియా హడావుడి ఉందని తెలిసి చివరి నిమిషంలో సునీల్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు. ఈ భేటీలో కేవలం లంచ్ కే అని చెప్తున్నా దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారట. పార్టీ లో చేరికలపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని బుజ్జగించేందుకే ఠాగూర్ వచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి మాత్రం పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తామని అంటున్నారు.

కోమటి రెడ్డి వెంకటర్ రెడ్డి, ఎంపీ, పిసిసి స్టార్ క్యాంపెయినర్.

జూబ్లీహిల్స్ క్లబ్ లోపార్టీ నేతల గెట్ టు గెదర్

నేతల మధ్య విభేదాలు లేవని చెప్పడానికే ఈ భేటీలు

ఇక టీ పీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ క్లబ్ లోపార్టీ నేతల గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసారు. ఈ గెట్ టూ గెదర్ కు ఠాగూర్ రాకున్నా మిగతా నేతలంతా వచ్చారు. అయితే పార్టీ నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పడానికే ఈ భేటీ లు అని పార్టీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories