GRMB, KRMB Meeting: కొనసాగుతున్న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ మీటింగ్

Ongoing GRMB, KRMB Meeting on Water Distribution
x

కొనసాగుతున్న జీఆర్ఎంబీ, కెఆర్ఎంబీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

GRMB, KRMB Meeting: హాజరైన తెలంగాణ, ఏపీ అధికారులు

GRMB, KRMB Meeting: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నీటి పంపకాలపై మీటింగ్ కొనసాగుతుంది. ఈ మీటింగ్‌కు రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సహా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఓ కొలిక్కి వస్తాయా లేక మళ్లీ పంచాయితీ కేంద్రం వద్దకు వెళ్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. బోర్డు పరిధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం వాడివేడిగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

నోటిఫికేషన్‌ అమలుపై బోర్డులు చర్చిస్తాయి, అభ్యంతరాలు ఏమైనా ఉంటే కేంద్రానికి నివేదించుకోమని సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను మాత్రమే పూర్తిగా బోర్డు పరిధిలో ఉంచితే సరిపోతుందని, అన్ని ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. తెలంగాణ కూడా దీనిపై వివరంగా చర్చించింది. తన అభిప్రాయాన్ని బోర్డు సమావేశంలో చెప్పడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. నీటి వాటాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చిస్తుంది.

ఒక ఏడాదిలో కేటాయించిన నీటిని వినియోగించుకోకుండా రిజర్వాయర్లలో ఉన్న వాటిని తర్వాతి సంవత్సరం వాడుకోవడానికి అవకాశం ఉండాలని తెలంగాణ కోరగా, ఏ సంవత్సరం లెక్క ఆ సంవత్సరంలోనేనని ఆంధ్రప్రదేశ్‌ అంటోంది. వరద సమయంలో రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉండి సముద్రంలోకి వదిలేటప్పుడు రాష్ట్రాలు తీసుకొనే నీటిని లెక్కలోకి తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్‌ అంటోంది. విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని లెక్కలోకి తీసుకోవాలని, తెలంగాణ విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరుతోంది. అయితే శ్రీశైలం పూర్తిగా జల విద్యుత్తు ప్రాజెక్టు అని, సాగు అవసరాలకు నీటిని మళ్లించడానికి వీల్లేదని తెలంగాణ పేర్కొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై సమావేశంలో లేవనెత్తనున్నారు తెలంగాణ అధికారులు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ఏపీ, కృష్ణా బేసిన్‌లోనే ఉంచాలని తెలంగాణ కోరాయి. దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలతో పాటు చిన్ననీటి వనరుల కింద నీటి వినియోగం, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో తెలంగాణకు వాటా తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై తెలంగాణ తరుపున వాదనలు గట్టిగా వినిపిస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి రజత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని గుర్తు చేశారు. న్యాయమైన వాటా కోసం సమావేశంలో ప్రశ్నిస్తామన్నారు. ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టు అని సమావేశంలో గట్టిగా చెప్పనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం ఇవ్వాల్సిందే రజత్ కుమార్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories