మిస్డ్ కాల్ కలిపింది ఇద్దరిని

మిస్డ్ కాల్ కలిపింది ఇద్దరిని
x
Highlights

ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. ఇక ఇంటర్నెట్ డేటా ఎంతుంటే అంతా హంగామా చేయవచ్చు. ఇక...

ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాదే హవా నడుస్తోంది ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. ఇక ఇంటర్నెట్ డేటా ఎంతుంటే అంతా హంగామా చేయవచ్చు. ఇక అప్పుడప్పుడు వచ్చే మిస్డ్ కాల్స్‌తో కొంచం ఇబ్బందులు పడుతున్నా అవి కొంత మంది జీవితంలో ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి. అలా ఓ మిస్డ్ కాల్‌ వల్ల ఓ అమ్మాయి ఒకరికి మిసెస్ అయిపోయింది.

ఒక్క మిస్ కాల్ వారిద్దరి మధ్య పరిచయం గా మారి ప్రేమకు దారి తీసింది. చివరకు పెళ్ళి పీటలు ఎక్కించింది. మహబూబాబాద్ జిల్లా కేసముధ్రంకు చెందిన గుండెల మురళికి అనంతపురం జిల్లా గుంతకల్లు కు చెందిన గైగట్టు రూతుకు సెల్‌ఫోన్‌ ద్వారా వచ్చిన మిస్ కాల్ తో పరిచయం ఏర్పడింది. ఒక సారి రూతు తమ బంధువులకు కాల్ చేయగా అదీ కాస్త యాదృచ్చికంగా మురళికి వెళ్ళింది. అప్పటి నుంచి మొదలైన పరిచయం ప్రేమగా మారింది. రూతుకు మురళీతో పరిచయం ఏర్పడ్డాకా అతడిని విడిచి ఉండలేక నెల రోజు క్రితం కేసముద్రానికి వచ్చింది. మురళిని కలుసుకుంది.

ఇక వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో గ్రామ వార్డు సభ్యుడు గాజగాని వీరన్న, కవిత దంపతులు రూతును చేరదీసి ఆశ్రయం కల్పించారు. చివరికి రూతు, మురళీ మహబూబాబాద్ అనంతాద్రి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. సో సోషల్ మీడియాలో ఇలాంటివి అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories