ఈనెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ

On 31st BJP Held a Huge Public Meeting in Munugode
x

ఈనెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ

Highlights

Munugode: సభకు హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Munugode: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారమే సమయం ఉంది. కమలనాథుల బైపోల్ క్యాంపెయిన్ నెక్స్ట్‎లెవెల్‎కి చేరనుంది. ఈనెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఏ మండలంలో సభ నిర్వహించాలనే దానిపై నేతలు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మునుగోడులో మకాం వేసిన బీజేపీ ముఖ్య నాయకులు.. దీపావళి పండుగను సైతం అక్కడే జరుపుకున్నారు. బండి సంజయ్, కిషన్‎రెడ్డి, లక్ష్మణ్, ఈటల దివ్వెల పండగను మునుగోడు ప్రజల మధ్య చేసుకున్నారు. దీపావళికి ఇంటికొచ్చిన క్యాడర్‎ను సైతం వెనక్కి రావాలని బీజేపీ పెద్దలు ఆదేశించారు. నేటి నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కమలం పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories