తెలంగాణలో 79కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. 24 గంటల్లో 317 కొత్త కరోనా కేసులు

Omicron and Corona Cases in Telangana Today 02 01 2022 | Omicron Live Updates
x

తెలంగాణలో 79కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. 24 గంటల్లో 317 కొత్త కరోనా కేసులు

Highlights

Omicron and Corona Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది...

Omicron and Corona Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. వారిలో 27 మంది కోలుకున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఇక, రోజువారీ కరోనా కేసుల్లో గడచిన 24 గంటల్లో 28,886 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 317 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 217 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories