Telangana: కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు అప్లై చేసుకున్నవారికి గుడ్ న్యూస్..

New Pensions and Ration Cards Will be Issued in Telangana Soon
x

Telangana: కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు అప్లై చేసుకున్నవారికి గుడ్ న్యూస్..

Highlights

Telangana: తెలంగాణలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

Telangana: తెలంగాణలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ఆగష్టు నెలలో అర్హులైవవారికి వాటిని మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరికైనా సాంకేతిక సమస్యలు ఉండి దరఖాస్తు చేసుకున్న అర్హులకు కార్డులు రాకపోతే పున: సమీక్షించి వారికి కూడా 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories