Nalgonda: నల్లగొండలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసుల ఉక్కుపాదం

Nalgonda High-Interest Scam Police Arrest 2 Key Agents Seize ₹7 Crore Assets Main Accused Absconding

Arun Chilukuri
Updated on: 15 Oct 2025 1:16 PM IST
Nalgonda: నల్లగొండలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసుల ఉక్కుపాదం
X

Nalgonda: నల్లగొండ జిల్లాలో అధిక వడ్డీ వ్యవహారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కీలక ఏజెంట్లను అరెస్టు చేశారు.​ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఏఎస్పీ మౌనిక మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారం పేరుతో అమాయక ప్రజలను మోసం చేశారంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.​ఈ కేసులో కొండమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు ASP మౌనిక తెలిపారు. వీరి నుంచి 7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

నిందితులు బాలాజీ నాయక్‌తో విభేదించి, పరారీలో ఉన్న మధు నాయక్ నేతృత్వంలో ఈ అధిక వడ్డీ వ్యాపారం చేసినట్లు నిర్ధారణ అయింది.​ మధు నాయక్, అభిషేక్, మహేష్‌లపై ఇప్పటివరకు 35 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు ఏజెంట్లను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి మధు నాయక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేసినట్లు ఏఎస్పీ మౌనిక పేర్కొన్నారు. అధిక వడ్డీ ఆశ చూపి ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story