నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషికి 21 ఏళ్లు జైలు శిక్ష

Nalgonda: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 15 Sept 2025 12:26 PM IST
నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషికి 21 ఏళ్లు జైలు శిక్ష
X

Nalgonda: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు దోమల రాముకు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా విధించింది.

ఈ ఘటన 2018 ఫిబ్రవరిలో జరగగా, అప్పట్లో చిట్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం 2022 నుంచి ఈ కేసుపై నల్గొండ పోక్సో కోర్టులో విచారణ కొనసాగుతోంది. సోమవారం ఈ కేసుపై తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి, దోషికి జైలు శిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story