రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఎంపీ సోయం బాపూరావు

రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఎంపీ సోయం బాపూరావు
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. టీఆర్ఎస్ ఓటమిని సీఎం కేసీఆర్ సహించలేక అయోమయం...

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. టీఆర్ఎస్ ఓటమిని సీఎం కేసీఆర్ సహించలేక అయోమయం సృష్టిస్తున్నారని అన్నారు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో అన్న భయం కేసీఆర్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీసులు పోడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసగించారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories