Motkupalli Narasimhulu: నేడు టీఆర్‌ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింహులు

Motkupalli Narasimhulu will join in TRS Party Today 18 10 2021
x

 మోత్కుపల్లి నర్సింహులు(ట్విట్టర్ ఫోటో)

Highlights

*సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక *మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో కార్యక్రమం

Motkupalli Narasimhulu: మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యహ్నం 12గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మోత్కుపల్లి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత బషీర్‌బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గన్ పార్క్‌లోని అమలవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి నేరుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories