డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ.. త్వరలో కాంగ్రెస్ తీర్థం..?

Motkupalli Narasimhulu Meets Karnataka Deputy CM DK Shiva Kumar
x

డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ.. త్వరలో కాంగ్రెస్ తీర్థం..?

Highlights

Motkupalli Narasimhulu: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నరసింహులు కలిశారు.

Motkupalli Narasimhulu: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నరసింహులు కలిశారు. కాంగ్రెస్‌లో పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. గత కొంతకాలంగా మోత్కుపల్లి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. డీకేతో మోత్కుపల్లి భేటీతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయి. అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుండి ఐదు సార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఒక సారి మొత్తం ఆరు సార్లు మోత్కుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆలేరు బీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడ్డ మోత్కుపల్లి గత కొంత కాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదు. అంతేకాదు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మోత్కుపల్లి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories