MLC Kavitha: బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha Fire On Central Government | TS News Today
x

బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

Highlights

MLC Kavitha: గ్యాస్‌ సిలెండర్‌పై సబ్సిడీ ఇప్పించాలంటూ బండి సంజయ్‌కి సవాల్‌

MLC Kavitha: ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా రోడ్లపైకి వచ్చేలా చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్‌ దమ్ముంటే గ్యాస్‌ సిలెండర్‌పై సబ్సిడీ ఇప్పించాలంటూ సవాల్‌ చేశారు. మోడీ ప్రభుత్వం పేదప్రజలకు ఏమీ చేయలేదన్నారు.

కానీ అప్పు చేసి దేశం విడిచివెళ్లిన బడా వ్యాపారవేత్తలకు మాత్రం రుణమాఫి చేసిందంటూ కవిత ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్చ గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories