Telangana: ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

MLC Election Counting of Telangana Today 14 12 2021
x

ఇవాళ తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌

Highlights

*ఉద‌యం 8 గంట‌ల‌ నుంచి ఐదు చోట్లా ఓట్ల లెక్కింపు *మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడనున్న పూర్తి స్థాయి ఫలితాలు

Telangana: తెలంగాణలో ఈనెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరనున్నది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో రెండు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరిగింది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్రత్తలు చేపట్టారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఒక వెయ్యి 324 మంది ఓటర్లకు గాను ఒక వెయ్యి 320 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచి పది మంది అభ్యర్ధులు పోటీ చేశారు. జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భాను ప్రసాద్ రావు పోటీ చేశారు. మెదక్ జిల్లాలో 99.22 శాతం నమోదయ్యింది. టీఆర్ఎస్ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పోటీచేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 97.01 శాతం నమోదు కాగా. టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్ధులుగా నగేష్ తో పాటు మరో ఐదుగురు పోటీ చేశారు. ఖమ్మం జిల్లాలో 96.09 శాతం నమోదయ్యింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున తాతా మధుసూదన్, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వర్ రావు, స్వతంత్య అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, స్వత్యంత్ర అభ్యర్ధి పుష్పరాణి బరిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories