Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారు

Vemula Prashanth Reddy: నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు ప్రాజెక్టులో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 5:48 PM IST
Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారు
X

Vemula Prashanth Reddy: నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు ప్రాజెక్టులో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడ్డారని అన్నారు. గతంలో కేసీఆర్‌ ఉన్నప్పుడు గంగపుత్ర సోదరుల చేపపిల్లల కోసం.. 35 కోట్ల వరకు ఖర్చు చేశారని ఎమ్మెల్యే వేముల గుర్తుచేశారు.

ఈ సంవత్సరం కోటి డెబ్భైనాలుగు లక్షల చేప పిల్లల పంపిణి చేస్తామన్న కాంగ్రెస్‌.. ఇంకా రొయ్య పిల్లలనే పంపిణీ చేయలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ తొమ్మిది ఏండ్ల పాలనలో ఇచ్చిన విధంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రులకు అన్ని సౌకర్యాలు అందించి అండగా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story