సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ‌

MLA Raja Singh Letter To CM KCR
x

సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ‌

Highlights

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గోషామహాల్ అసెంబ్లీలో అభివృద్ధి, పనుల అనుమతికి సీఎం అపాయింట్ మెంట్ కావాలని చాలా మార్గాల ద్వారా విజ్ఞప్తి చేశానన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కలుస్తాని హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు కేసీఆర్‌ను కలిసే అవకాశం రాలేదన్నారాయన. కానీ మజ్లీస్ ఎమ్మెల్యేలకు మాత్రం వందల కోట్ల పనులు మంజూరు అవుతున్నాయని గోషామహాల్ లో మాత్రం ఒక్క పని కూడా మంజూరుకాలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలను కలవరా అంటూ ప్రశ్నించారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories