కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు లాభం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు లాభం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
x
Highlights

పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం...

పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అటు పోలీసులను, ఇటు డబ్బును విచ్చలవిడిగా వాడుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ కూడా వారికే సపోర్టు కాబట్టి గెలిచినట్లుగా భావిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్‌, 12 శాతం రిజర్వేషన్‌లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఎస్సీలకు 12 రిజర్వేషన్‌లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్‌లో గెలిచినందుకు సీఎం కేసీఆర్‌ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. ఇదే రీతిలో భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడిస్తే సీఎం వంద మెట్లు దిగివస్తారని, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ పిల్లలంతా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా దుబ్బాకలో పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని, అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్‌ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories