Nirmal: నిర్మల్ జిల్లాలో మంత్రులు హరీష‌రావు, ఇంద్రకరణ‌రెడ్డి పర్యటన

Ministers Harish Rao and Indira Reddy visit Nirmal District
x

నిర్మల్ జిల్లాలో మంత్రులు హరీష‌రావు, ఇంద్రకరణ‌రెడ్డి పర్యటన 

Highlights

Nirmal: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 9 లక్షల 90వేలతో నిర్మించనున్న ఎంసీహెచ్‌లో 6 పడకల పాలియేటివ్ కేర్ వార్డును ప్రారంభించారు.

ఆ తర్వాత దివ్య నగర్‌లో 39. 96 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న 250 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమని మంత్రులు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories