దమ్ముంటే వరద బాధితులకు రూ.25 వేల ఆర్థిక సాయం చేయాలి: తలసాని

Arun Chilukuri
Published on: 19 Dec 2020 5:58 PM IST
దమ్ముంటే వరద బాధితులకు రూ.25 వేల ఆర్థిక సాయం చేయాలి: తలసాని
X

నాలుగు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఏదిపడితే అదిమాట్లాడుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. దమ్ముంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రకటించినట్లు వరద బాధితులకు 25 వేల ఆర్థిక సాయం ఇచ్చి చూపించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలన్న తలసాని నీలాంటి వాళ్లను సీఎం కేసీఆర్ చాలామందిని చూశారని మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story