Telangana: ఇదే చివరి హెచ్చరిక- కేటీఆర్‌

Telangana: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 12 April 2021 8:33 PM IST
Minister KTR Strong Warning To BJP Leaders
X

Telangana: ఇదే చివరి హెచ్చరిక- కేటీఆర్‌

Telangana: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంచి రోజులు తీసుకొస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోడీ పెట్రోల్, డీజిల్‌, గ్యాస్, కూరగాయలు, ఎరువులు ఇలా అన్నింటి ధరలూ పెంచేసి చచ్చే రోజులు తెచ్చారని విమర్శించారు. ఇక, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకుండానే అన్నీ కేంద్రమే ఇస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తే బీజేపీ నేతలు బూతులు తిడుతున్నారన్న కేటీఆర్ ఇకపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ వార్నింగ్ ఇఛ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story