Minister KTR: రాష్ట్ర ప్రజలకు డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి

Minister KTR Says Drones are Very Useful to the People
x
మినిస్టర్ కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Minister KTR: ట్రాఫిక్‌ సమస్య లేకుండా మందులు, రక్తం సరఫరా చేయొచ్చు

Minister KTR: డ్రోన్స్‌ ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడవచ్చని, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ఆర్గాన్స్‌, మందులు, రక్తం చేరవేయడానికి డ్రోన్లు ఉపయోగకరమని అన్నారు మంత్రి కేటీఆర్. వికారాబాద్‌లో మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్పిన ప్రతిసారీ.. దీనివల్ల సామాన్యులకు ఏం లాభం జరుగుతుందని సీఎం కేసీఆర్ అడుగుతారని అన్నారు మంత్రి కేటీఆర్‌. దేశంలో డ్రోన్ల ద్వారా ఔషధాలు పంపిణీ చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచందన్నారు మంత్రి కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories