మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ సమీక్ష !

మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ సమీక్ష !
x
Highlights

Malkajgiri: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు....

Malkajgiri: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో అయా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మెహాన్ లతో కలసి సమీక్షించారు. లాక్ డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ లేయింగ్, నిర్మాణం వంటి పనులకు చక్కగా వినియోగించు కున్నారన్నారు. ప్రజలనుంచి మంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. చాల మంది లాక్ డౌన్ అనంతరం బయటకు వచ్చి తమ కాలనీల్లో మారిన రోడ్లను చూసి హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యేలు తెలిపారు.

సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం వారీగా చేపట్టాల్సిన పనులపైన ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. స్ధూలంగా జీహెచ్ఎంసీ ద్వారా పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఏల్ బినగర్ చౌరాస్తా వంటి చోట్ల మెత్తం రూపురేఖలు మారిపోయాయని, అంత వేగంగా ఇన్ఫ్రా పనులు జరిగాయాన్నారు. ఏస్ అర్ డిపి పనులు ద్వారా అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు. ఈ సమావేశం సందర్భంగా ప్రతి నియోజక వర్గానికి ఒక పెద్ద మహా ప్రస్థానం లాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే అనుమతులు వచ్చిన చెరువుల అభివృద్ది, సుందరీకరణ పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సానిటేషన్ పనులు భాగానే కోనసాగుతున్నాయని, జల మండలి పరిధిలోకి వచ్చిన సీవరేజి నిర్వహాణపైన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజక వర్గాల పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేల కోరారు. సంవత్సరాంతానికి సూమారు 75 వేల ఇళ్లు పంపీణీకి సిద్దంగా ఉంటాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఫుట్ పాత్‍లు , పబ్లిక్ టాయిలేట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని మంత్రికి తెలిపారు. దీంతోపాటు లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ది వంటి కార్యక్రమాలు కూడా జీహెచ్ఎంసీ మంచి పేరు తీసుకువచ్చాయని ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories