కిమ్స్ ఆసుపత్రిలో జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి

అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2026 2:50 PM IST
కిమ్స్ ఆసుపత్రిలో జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి
X

అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. శుక్రవారం ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

జీవన్ రెడ్డికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. ఆయన సీనియర్ నాయకుడని, ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న జీవన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. పరామర్శించిన వారిలో ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story