Adluri Laxman: కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్లలో అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసింది

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 2:43 PM IST
Adluri Laxman: కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్లలో అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసింది
X

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమంపై అడ్లూరి వ్యాఖ్యలు:

"కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజల కోసం అనేక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగింది."

"రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను తప్పకుండా చేపడతామని" ఆయన హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి, పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ప్రచారంలో పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story