Raghunandan Rao: భవిష్యత్ తరాల కోసం అమృత్ 2.0 రూపొందించాం

Amrut 2.0 Scheme Medak: భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్‌‎రావు తెలిపారు.

Arun Chilukuri
Published on: 10 Oct 2025 12:08 PM IST
Raghunandan Rao: భవిష్యత్ తరాల కోసం అమృత్ 2.0 రూపొందించాం
X

Raghunandan Rao: భవిష్యత్ తరాల కోసం అమృత్ 2.0 రూపొందించాం 

Amrut 2.0 Scheme Medak: భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్‌‎రావు తెలిపారు. మెదక్ జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ పథకం నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు.

అమృత్ 2.0 పథకం ద్వారా జిల్లాలోని వివిధ వార్డులలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 2.0 ద్వారా పట్టణంలో 32 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సబ్ స్టేషన్ మునిగిపోయిందని... దీంతో జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపేయడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ కోసం నిధులు మంజూరు అవడంతో త్వరలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఆయన వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story