మారుతీరావు సూసైడ్‌ నోట్ లో అమృత ప్రస్తవన

మారుతీరావు సూసైడ్‌ నోట్ లో అమృత ప్రస్తవన
x
Highlights

మారుతీరావు సూసైడ్‌ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్‌ నోట్‌లో అమృత గురించి రాసినట్లు సమాచారం. తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అంటూ లెటర్ రాసినట్లు తెలుస్తోంది.

అమృతాప్రయణ్ తండ్రి మారుతీరావు ఈరోజు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మారుతీరావు సూసైడ్‌ చేసుకున్న ప్రదేశంలో నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ సూసైడ్‌ నోట్‌లో అమృత గురించి రాసినట్లు సమాచారం. తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అంటూ లెటర్ రాసినట్లు తెలుస్తోంది.

అయితే వారం రోజుల క్రితమే ఆస్తులన్నీ తన భార్య పేరు మీద రాసినట్లు తెలుస్తోంది.ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మారుతీరావును చూసిన వైశ్య భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మారుతీరావు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృత అంటే వల్లమాలిన ప్రేమ.. కానీ, ఆ ప్రేమే ద్వేషంగా మారింది.. తన గారాలబిడ్డ కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించాడు.. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం పన్నాడు.

ప్రేమ వివాహం చేసుకున్న కూతురికి ఆస్తి దక్కకూడదని, ఆమె భర్త కూడా ఉండకూడదని మారుతీ రావు నిశ్చయించుకున్నాడు. కోటి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్‌ని హత్య చేయించాడు. సంచలనం సృష్టించిన అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ప్రణయ్‌ హత్యకు మాజీ ఐఎస్‌ఐ తీవ్రవాదులతో మారుతీరావు కోటి రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అమృతకు చెందకూడదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు ఎటువంటి హక్కు లేదని వీలునామాలో రాశాడు.

మారుతీరావుకు సంబంధించిన షెడ్డులో ఇటీవలే గుర్తు తెలియని మృతదేహం లభించింది. మారుతీరావు షెడ్డులో మృతదేహం లభించడం అదికూడా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ మారుతీ రావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories