తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Maoist Killed in Encounter in Chhattisgarh
x

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

Highlights

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్కా జిల్లా మార్జుమ్‌ అటవీ ప్రాంతం టోంగ్‌పాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కాల్పులు జరిగాయి. మావోయిస్టు ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.

మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఓ జవాన్‌కు గాయాలు అయ్యాయి. దీంతో గాయపడ్డ జవాన్‌ మధును ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహాదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ దళ కమాండర్‌ సుధాకర్‌ ఉ‍న్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories