Mallareddy Land Issue: మరోసారి తెరమీదకు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం

Mallareddy Land Issue: మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 4:27 PM IST
Mallareddy Land Issue: మరోసారి తెరమీదకు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం
X

Mallareddy Land Issue: మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకి వచ్చింది. కొన్నాళ్లుగా జీడిమెట్లలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డికి ఎకరం 22 గుంటలు ఉండగా.. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అతని మిత్రులకు 33 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూముల మధ్య వివాదం నెలకొనడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.

బౌద్ధ నగర్ నుంచి సుచిత్రకు వెళ్లే రహదారి దగ్గర సర్వే చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ బారికేడ్లు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు తమ భూముల్లో సర్వే చేస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరులతో సహా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story