Malla Reddy: సిల్వర్ స్ర్కీన్‌లోకి మల్లన్న.. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి..

Malla Reddy Entering Into The Cinema Industry
x

Malla Reddy: సిల్వర్ స్ర్కీన్‌లోకి మల్లన్న.. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి..

Highlights

Malla Reddy: ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు తీసేందుకు ప్లాన్‌ చేస్తున్న మల్లన్న

Malla Reddy: రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి మల్లారెడ్డి అంటే తెలియరు వారు ఉండరు. మల్లారెడ్డి రాజకీయాల్లో తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మల్లారెడ్డి ఇచ్చే ప్రసంగాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయ ప్రేక్షకులతో పాటు మాములు జనాల్ని కూడా మల్లారెడ్డి తనదైన డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. రీసెంట్ గా పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డ.. బోర్‌వెల్ నడిపించినా.. చిట్ ఫండ్స్ పెట్టిన.. సక్సెస్ అయిన’ అనే డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. మల్లారెడ్డి రాజకీయాల నుంచి సిల్వర్ స్ర్కీన్‌ వైపు తన రూటు మార్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి సినీ ఇండస్ట్రీకి కూడా సెలబ్రీటీగా మారాడు. కొత్తగా సినిమాలు విడుదల చేస్తున్న వారు మంత్రితో ఆడియో ,ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. మరికొందరైతే సినిమా గురించి మంత్రి మల్లారెడ్డితో ఇంటర్యూలు చేయించి వదులుతున్నారు. ఈ సంఘటనలన్నీ కూడా మంత్రికి సినిమాపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.అంతేకాదు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. నాలుగు సినిమాలను కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా హజరైన ఓ ఫంక్షన్‌లో తన మనసులోని మాటను బయట పెట్టారు. అవకాశమిస్తే మీతో సినిమా తీస్తానని కూడా అన్నారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని పలువురు దర్శకులతో కథల గురించి మల్లారెడ్డి డిస్కస్ చేశారట. వచ్చే ఎన్నికలు తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన ఇమేజ్ ను మరింతగా పెంచుకోనున్నారని తెలుస్తుంది. డిసెంబర్ నెలలో మల్లారెడ్డి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ సినిమాకు క్లాప్ కొట్టడం పక్కా అనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories