Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు
x

Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు 

Highlights

Nalgonda: నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టాక్టర్‌ను ఢీకొట్టింది.

Nalgonda: నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కావలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories