Etela Rajender: ఈటల బృందానికి తప్పిన ప్రమాదం

Major Accident Averted to Etela Rajenders Team Amid Technical Error in Aeroplane
x

Etela Rajender: ఈటల బృందానికి తప్పిన ప్రమాదం

Highlights

Etela Rajender: ఈటల బృందానికి పెను ప్రమాదం తప్పింది.

Etela Rajender: ఈటల బృందానికి పెను ప్రమాదం తప్పింది. బీజేపీలో చేరిన ఈటల ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. వెంటనే ఫైలెట్‌ అలెర్ట్‌ అవ్వడంతో పెను ప్రమాదం నుంచి ఈటల బృందం బయటపడింది. టేకాఫ్‌ సమయంలో రన్-వే పై సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన ఫైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరి సేఫ్‌ అయ్యారు.

ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది నాయకులు ఉన్నారు. అయితే విమానం ఈ సమయానికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. సాంకేతిక సమస్య కారణంగా విమానం గంటపాటు ఆలస్యమైంది. మరి కొద్ది నిమిసాల్లో ఈటల ప్రయాణించే విమానం హైదరాబాద్‌కు చేరుకోనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories