జనగామ జిల్లాలో మరో ప్రేమజంట ఆత్మహత్య
వరంగల్ అర్బన్ జిల్లాలో నిన్న ప్రేమజంట ఆత్మహత్య ఘటన మరువకముందే జనగామ జిల్లాలో మరో ప్రేమజంట సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. పాలకుర్తిలో పురుగులమందు తాగి మైనర్లు అంజయ్య, లక్ష్మి మృతి చెందారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అంజయ్య వయస్సు 18 కాగా లక్ష్మికి 17 ఏళ్లు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
Next Story




