లోన్‌యాప్‌ కేసులో పోలీసుల అదుపులో కీలక సూత్రధారి

లోన్‌యాప్‌ కేసులో పోలీసుల అదుపులో కీలక సూత్రధారి
x
Highlights

* ఢిల్లీలో చిక్కిన కొత్తగూడెం జిల్లాకు చెందిన మధుబాబు * మధుబాబు విచారణలో సంచలన విషయాలు * ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్ట్ * 18 బ్యాంక్ అకౌంట్లు, రూ. 1.52 కోట్లు సీజ్‌

లోన్ యాప్స్‌ కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సింగి మధుబాబు.. ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. ఎలాంటి ఆర్బీఐ అనుమతులు లేకుండానే మైక్రో ఫైనాన్స్‌ యాప్‌ నిర్వహణకు మధుబాబు కీలక సూత్రధారి అని గుర్తించారు.

ఇప్పటికే విచారణలో మధుబాబు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుండగా..మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇక ఇప్పటివరకు ఈ కేసులో లోన్ యాప్ కంపెనీల నిర్వాహకులు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 18 బ్యాంకు అకౌంట్లు, వాటిలోని కోటి యాభై లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. ల్యాప్‌ టాప్‌లు‌, కంప్యూటర్ సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories