హైదరాబాద్ : ప్రమాణస్వీకారానికి ముందే బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

హైదరాబాద్ : ప్రమాణస్వీకారానికి ముందే బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత
x
Highlights

హైదరాబాద్ లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనా భారీన పడి కన్నుమూశాడు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున కార్పొరేటర్ గా విజయం...

హైదరాబాద్ లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనా భారీన పడి కన్నుమూశాడు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే మృతిచెందడంతో బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రమేష్‌గౌడ్ మృతి వార్త తెలుసుకున్న బీజేపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఫలితాలు వెల్లడైన మూడు రోజులకే కరోనా బారీన పడ్డారు రమేష్ గౌడ్. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories