Nizamabad: సిరికొండలో చిరుత కలకలం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 11:31 AM IST
Nizamabad: సిరికొండలో చిరుత కలకలం
X

Nizamabad: సిరికొండలో చిరుత కలకలం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. సిరికొండ రేంజ్ పరిధిలోని తిరుపతిగుట్ట అటవీ ప్రాంతంలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని ఇన్ఛార్జి రేంజర్ రవీందర్ తెలిపారు. గోప్యానాయక్ తండాకు చెందిన మలావత్ రఘుపతికి చెందిన లేగదూడ అటవీప్రాంతంలో మేతకు వెళ్లి మృతిచెందడంతో అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. పశువులపై అటవీ జంతువులు దాడి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఇన్ఛార్జి రేంజర్ రవీందర్ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story