Hyderabad: హైద‌రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

LB Nagar SOT Police Arrested the Gang Involved in Betting on T20 World Cup Matches
x

హైద‌రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్(ఫైల్ ఫోటో)

Highlights

* రూ. 14.92 లక్షలు, ల్యాప్‌టాప్, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

Hyderabad: టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీన‌గ‌ర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ లైవ్ గురూ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి రూ. 14.92 లక్షలు, ల్యాప్‌టాప్, 9 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే ముఠాల‌పై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని సీపీ హెచ్చరించారు. బెట్టింగ్‌ల గురించి తెలిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. స‌మాచారం ఇచ్చిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాకుండా వారికి న‌గ‌దు ప్రోత్సాహం కూడా ఇస్తామ‌ని సీపీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories