ముగిసిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు.. పాడె మోసి నివాళులర్పించిన మంత్రులు..

Last Rites of the FRO Srinivasa Rao Completed
x

ముగిసిన అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు.. పాడె మోసి నివాళులర్పించిన మంత్రులు..

Highlights

FRO Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.

FRO Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories