వనస్థలిపురం సాహెబ్నగర్లో భూవివాదం
Land Dispute In Vanasthalipuram
వనస్థలిపురం పరిధిలోని సాహెబ్నగర్లో భూ వివాదంలో ఘర్షణ చోటు చేసుకుంది. శరత్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కొంతమంది రౌడీలు కబ్జా చేసేందుకు వచ్చారు శరత్ వారిని అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు ఓ మాజీ కార్పొరేటర్ అనుచరులు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




