ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీకి ప్రతిష్ఠాత్మక అవార్డు
x
Highlights

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ...

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను కేవీబీ రెడ్డికి కన్‌స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గ్లోబల్ అవార్డు వరించింది. నిర్మాణ రంగం, వ్యాపారంలో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్న వారికి ఈ అవార్డు ఇస్తారు. ప్రైవేట్ రంగానికి సంబంధించి ఆయన ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కేవీబీ రెడ్డి కన్‌స్ట్రక్షన్ వరల్డ్‌తోపాటు జ్యూరీకి కృతజ్ణతలు తెలిపారు. కేవీబీ రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది అవార్డు విజేతలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories