ఆ సమస్యకు వెంటనే ముగింపు పలకండి.. మంత్రి కేటీఆర్‌ ఆదేశం..

KTR: నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 8 Nov 2022 2:30 PM IST
KTR Urges Education Minister to Address Nizam College Students Protest
X

ఆ సమస్యకు వెంటనే ముగింపు పలకండి.. మంత్రి కేటీఆర్‌ ఆదేశం..

KTR: నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్య పరిష్కారం కోసం ఆయన భరోసా ఇచ్చారు. హాస్టల్‌ నిర్మాణం తర్వాత కూడా ఆందోళన ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని త్వరగా తేల్చాలంటూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. అలాగే పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలంటూ నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. మూడు రోజుల క్రితం విద్యార్థినులు నిజాం కాలేజీ ప్రన్సిపల్‌ చాంబర్‌ను ముట్టడించారు. కొత్తగా నిర్మించిన హాస్టల్‌ను అండర్‌ గ్రాడ్యుయేట్‌ గర్ల్స్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story