KTR on Corona Treatment Price: ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై స్పందించిన కేటీఆర్‌

KTR on Corona Treatment Price: ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై స్పందించిన కేటీఆర్‌
x
మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో
Highlights

KTR on Corona Treatment Price: కరోనా సోకిన బాదితులను ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యం ఫీజలు విషయంలో బాధితులను పీడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు...

KTR on Corona Treatment Price: కరోనా సోకిన బాదితులను ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యం ఫీజలు విషయంలో బాధితులను పీడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దీంతో స్పందించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో దోపిడీకి గురైన బాధితులు సోషల్ ‌మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. సోషల్ ‌మీడియాలో వచ్చిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కరోనా విస్తరిస్తున్న వేళ ప్రైవేట్ ఆస్పత్రులు ఈ విధంగా బాధితుల నుంచి దోపిడీ చేయడం దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్‌ను కేటీఆర్‌ ట్విటర్‌లో కోరారు.

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ తన నుంచి ఆరు ఆంబులెన్స్‌ను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరు కోవిడ్ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోవిడ్ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి ఆరు అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు.

మరోవైపు పలువురు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌ స్ఫూర్తితో ఇప్పటికే అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంబులెన్స్‌లను కొవిడ్‌ రెస్పాన్స్‌ వాహనాలుగా వాడనున్నారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories